నవతెలంగాణ – వరంగల్
రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఐసెట్-2023 ఫలితాలను గురువారం విడుదల చేయనున్నట్లు ఐసెట్ కన్వీనర్ ఆచార్య పి.వరలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, కేయూ ఉప కులపతి ఆచార్య టి.రమేశ్ విడుదల చేస్తారని పేర్కొన్నారు. ఫలితాల కోసం https://icet.tsche.ac.in వెబ్సైట్ చూడాలని తెలిపారు.