నవతెలంగాణ – సిక్కిం: సిక్కింలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగళవారం అర్థరాత్రి నుంచి కురుస్తున్న కుంభవృష్టి వర్షానికి లాచెన్ వ్యాలీలోని తీస్తా నది ఉగ్రరూపం దాల్చింది. ఈ వరదల ఉధృతిలో 23 మంది ఆర్మీ జవాన్లు గల్లంతు కాగా అందులో తెలంగాణకు చెందిన ఓ జవాన్ ఉన్నారు. నిజమాబాద్ జిల్లా సాలూర మండలం కుమ్మన్పల్లి గ్రామానికి చెందిన నీరడి గంగాప్రసాద్ ఉన్నట్లు సైనికాధికారులు, కుటుంబ సభ్యులుతెలిపారు. లాన్స్నాయక్ గంగాప్రసాద్ బృందం కొద్ది రోజుల క్రితం పశ్చిమ బెంగాల్లోని క్యాంపు నుంచి భారత్-చైనా సరిహద్దుకు వెళ్లింది.