– ప్రచారంలో…చల్లాకు ప్రజల ఘన స్వాగతం
నవతెలంగాణ- మల్హర్ రావు: మంథని నియోజకవర్గంలో మరో మార్పునకు నాంది పలకడానికి ప్రజలు సిద్ధమయ్యారని మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా నారాయణరెడ్డి అన్నారు. మంథని నియోజకవర్గం కమాన్ పూర్ లోని పెరపల్లి, రొంపికుంట గ్రామాల్లో శుక్రవారం గడపగడపకు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రజలు చల్లాకు ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నిర్లక్ష్యంగా మంథని నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ నేతృత్వంలో రాష్ట్రంలో బిఎస్పీ అధికారంలోకి రాబోతుందన్నారు. బిఎస్పీ అధికారంలోకి వస్తేనే అణగారిన, పేద వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. బీఎస్పీ అధికారంలోకి రావాలంటే ఏనుగు గుర్తుకు ఓటువేసి ఆశీర్వదించాలని ప్రజలను వేడుకొన్నారు.