నవతెలంగాణ- వరంగల్: హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్న గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక అంతిమయాత్ర ప్రారంభమైంది. స్వగ్రామం దుగ్గొండి మండలం బిక్కాజిపల్లిలో అంతిమయాత్ర మొదలవగా.. అంతకుముందే బొక్కాజిపల్లికి చేరుకున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రవళిక మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపు ఆ ప్రాంతంలో గందరగోళం చోటు చేసుకుంది. తరువాత కొద్దిసేపటికి ప్రవళిక అంతిమయాత్రను మొదలుపెట్టారు.