– బహుజన్ సమాజ్ పార్టీ
– మండల అధ్యక్షులు కోకిల అజయ్ కుమార్
నవతెలంగాణ-గోవిందరావుపేట
గాలి వాన బీభత్సంతో నష్టపోయిన రైతులను కుటుంబీకులను ప్రభుత్వం ఆదుకోవాలని బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు కోగిల అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో గాలివానకు పూర్తిగా నష్టపోయి పైకప్పు ఎగిరి పోయి సర్వం కోల్పోయిన కుటుంబాన్ని అదే కుమార్ పరా మర్శించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లా డుతూ ఎన్టీఆర్ కాలనీ గోవిందరవుపేట గ్రామంలో శనిగా రపు ప్రమీల నిరుపేద కూలిగా అనేక ఇబ్బందులు పడుతూ జీవనాన్ని కొనసాగిస్తూ, తన కూతురిని చదివిస్తూ అనేక ఆర్థిక ఇబ్బందులలో జీవిస్తున్న తరుణంలో ప్రకృతి వారి జీవి తాన్ని శనివారం సాయంత్రం గాలివాన బీభత్సం రూపంలో మరింత అంధకారంలో కి నెట్టింది,ఇళ్ళు పంట పొలాలకు అనుకోని ఉండడంతో ఒక్కసారిగా బలమైన గాలి వారి ఇంటి రేకులు పూర్తిగా ద్వంసం చేసింది అదేసమయంలో ఇంట్లోనే ఉన్న ప్రమిలకు రేకులు విరిగి మీద పడడంతో తలకు గాయం ఐనది, కనీసం ఒక్క రేకు కూడా లేకుండా ఇళ్ళు రేకులు మొత్తం గాలికి విరిగిపోవడంతో ఇల్లు మొత్తం చిందరవందరగా నిలువ నీడలేని పరిస్థితుల్లో దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రభుత్వం నుండి తనకు జరిగిన నష్టానికి ప్రభుత్వం తరుపున ఇళ్ళు కేటాయించాలని తనకు జరిగిన ఆర్థిక నష్టానికి తక్షణ సాయంగా ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటుందనీ ప్రమీలకు ఆర్థిక సహాయం అందించడం తోపాటు డబుల్ బెడ్ రూమ్ నిర్మించి ఇవ్వాలని అన్నారు.