నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ నగరం లోని 19వ డివిజన్ చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కాడసి శ్రవణ్ కుమార్ కరెంట్ షాక్ తో మరణించాడు. బి ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వం ద్వారా మంజూరైన 2 లక్షల ప్రమాద భీమా చెక్కుని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల క్యాంపు కార్యాలయం లో శుక్రవారం కుటుంబ సభ్యులకు అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ క్రీయాశీల కార్యకర్త శ్రావణ్ మృతి చెందడం బాధాకరం అని అన్నారు.పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన 2 లక్షల రూ. చెక్కును కుటుంబ సభ్యులకు అందచేయడం జరిగింది.శ్రావణ్ కుటుంబానికి అండగా ఉంటాము. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలు పునాదులు లాంటి వారు.వారికి ఏ ఆపద వచ్చిన ఏళ్ల వేళలా అందుబాటులో ఉంటానాని తెలియ చేస్తున్నాను.ఈ కార్యక్రమంలో నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు,సుజిత్ సింగ్ ఠాకూర్,సూదం రవి చందర్, సిర్ప రాజు,శివ చరణ్, తడ్కల్ శ్రీనివాస్, గంగమని, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.