నవ తెలంగాణ- బోధన్ టౌన్:
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ నేడు ప్రకటించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ద్వితీయ స్థానంలో నిలిచారు. గతంలో వారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు. ఈసారి విజయం సాధిస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.