![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/11/IMG-20231110-WA1091.jpg)
రానున్న ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురుతుందని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి మండలంలోని నెల్లిబండ, గొల్లగూడెం, చందంపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం ప్రతి ఇంటి గడపకు అందుతుందని పేర్కొన్నారు. రైతుబంధు, దళిత బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, ఆసరా పెన్షన్ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. పథకాల అమలులో దేశంలోనే రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. అభివృద్ధిలో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నకిరేకల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే కటిక చీకట్లు తప్పమన్నారు. మూడు గంటల కరెంటు రైతులకు సరిపోతుందా… అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, రాష్ట్ర నాయకులు డాక్టర్ చెరుకు సుధాకర్, చింతల సోమన్న, జడ్పిటిసి మాద ధనలక్ష్మి నగేష్ గౌడ్, ఎంపీటీసీ బోయిల కిషోర్, నాయకులు నోముల కేశవరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సూదిని జానకి రెడ్డి, గుడు గుంట్ల శ్రీహరి, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.