– తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
– ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి
నవతెలంగాణ – మీర్ పేట్
తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగం అజరామరం అని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చివరి రోజు అమరవీరుల దినోత్సవం సందర్భంగా జిల్లెలగూడ సందే చెరువు కట్టపై అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి బాలాపూర్ చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరవీరులు తమ ప్రాణాలను తెగించి తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మబలిదానాలు చేసిన అమరవీరులకు జోహార్లు అర్పించారు. తెలంగాణ రాష్ట్రం, సూర్యచంద్రులు ఉన్నంతవరకు అమరవీరుల త్యాగం చెరిగిపోదని ధ్రువతారాలుగా వెలుగొందుతారని అన్నారు. అమరవీరులు తెలంగాణ ఉద్యమకారులు కలలుగన్న రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకెళ్తున్నారని చెప్పారు. బంగారు తెలంగాణ దిశగా తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో అభివృద్ధి పతంలో నడుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కేసీఆర్కు బిఆర్ఎస్ పార్టీకి మరోసారి ప్రజలు ఆదరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ప్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ సిద్దాల లావణ్య, బిఆర్ఎస్ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ నాగేశ్వర్, డిఈ, ఎఈ, స్థానిక కార్పొరేటర్లు, కో అప్షన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.