నవతెలంగాణ-హైదరాబాద్ : నారాయణ పేట జిల్లా గుండుమల్ మండలం భోగారం గ్రామ శివారులో మహిళ దారుణ హత్య ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. భోగారం శివారులో రోడ్డు పక్కన గుర్తు తెలియని మహిళ మృతదేహం కాలిపోయి ఉండటాన్ని గ్రామస్థులు ఆదివారం ఉదయం గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ జనార్దన్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మహిళ మృతదేహం ముక్కలుముక్కలుగా దహనం చేసి ఉండటంతో.. హత్య చేసిన అనంతరం తగులబెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. డాగ్స్క్వాడ్, క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. డీఎన్ఏ టెస్టు, పోస్టుమార్టం అనంతరం వివరాలు వెల్లడిస్తామని సీఐ జనార్దన్ తెలిపారు.