నవతెలంగాణ – హైదరాబాద్: టిల్లు బాయ్ సిద్దు జొన్నలగడ్డ మరో సరికొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించే 30వ సినిమాలో సిద్దు, రాశి కన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాను నీరజ కోన తెరకెక్కించనుండగా…. ‘తెలుసు కదా’ టైటిల్ ను ఫిక్స్ చేస్తూ అనౌన్స్మెంట్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. వీడియోలో సిద్దు లుక్ ఆకట్టుకుంటుంది.