నవతెలంగాణ – హైదరాబాద్
వన్డే వరల్డ్కప్-2023 షెడ్యూల్ను ఐసీసీ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. భారత్లో జరిగే ఈ మెగా టోర్నీ అక్టోబర్ 5న మొదలై నవంబర్ 19న ముగుస్తుంది. టోర్నీ ఆరంభ, ఫైనల్ మ్యాచ్లకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్.. రన్నరప్ న్యూజిలాండ్తో తలపడుతుంది. ఈ మెగా టోర్నీలో మూడు మ్యాచ్లకు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో రెండు మ్యాచ్లు పాకిస్తాన్వి కావడం విశేషం. మరో మ్యాచ్లో న్యూజిలాండ్ క్వాలిఫయర్-1తో తలపడుతుంది.
ఉప్పల్ స్టేడియంలో జరుగబోయే మ్యాచ్ల వివరాలు..
– అక్టోబర్ 6 (శుక్రవారం): పాకిస్తాన్ వర్సెస్ క్వాలిఫయర్-1
– అక్టోబర్ 9 (సోమవారం): న్యూజిలాండ్ వర్సెస్ క్వాలిఫయర్-1
– అక్టోబర్ 12 (గురువారం): పాకిస్తాన్ వర్సెస్ క్వాలిఫయర్-2