![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/IMG-20230706-WA01501-300x169.jpg)
ఫారెస్ట్ అధికారుల నుండి ఎలాంటి అనుమతులు లేకుండానే తన పంట పొలంలో ఉన్న టేకు చెట్లను నరికి ఒక వాహనంలో బోధన్ కు తరలిస్తున్నారనే సమాచారం మేరకు డిచ్ పల్లి సమీపంలో పట్టుకుని ఇందల్ వాయి ఫారెస్ట్ రేంజ్ కారడానికి తరలించినట్లు రేంజ్ అధికారిని హిమాచందన గురువారం రాత్రి తెలిపారు. రేంజ్ అధికారిని తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇందల్ వాయి రేంజ్ పరిధిలోని యానంపల్లి సెక్షన్లోని మిట్టపల్లి గ్రామ శివారులోని ఒక పంట పొలంలో ఎలాంటి అనుమతులు లేకుండా టేకు చెట్లను నరికి టేకు దుంగలను ఒక వాహనంలో తరలిస్తున్నారనే విశ్వనియా సమాచారంతో సెక్షన్ అధికారి బాపురావు, బీట్ అధికారులు సాయికుమార్, వినోద్, స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బందితో కలిసి వాహనాన్ని వెంబడించి డిచ్పల్లికి సమీపన టేకు దుంగలు తరలిస్తున్న వ్యాన్ ను పట్టుకొని రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు రేంజ్ అధికారిని హిమాచందన తెలిపారు. పట్టాదారుతో పాటు పలువురు రేంజ్ కార్యాలయానికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. శుక్రవారం అటవీశాఖ అధికారులతో ఎక్కడి నుండి చెట్లను నరికారో పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. పట్టాదారు పంట పొలంలోనైనా చేట్లను నరికినప్పుడు తప్పనిసరి పరిస్థితులలో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని ఎలాంటి అనుమతులు లేకుండానే టేకు చెట్లను నరికి వేయడంతో పట్టుకున్నామని వివరించారు. జరిగిన విషయమై ఉన్నతాధికారులకు విషయం వివరించినట్లు రేంజ్ అధికారిని తెలిపారు. ఈ దాడిలో స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది గణేష్, హరీష్, మహేష్, వంశీ, తో పాటు తదితరులు ఉన్నారు.