![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/IMG20230916102110.jpg)
– మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతి రెడ్డి..
నవతెలంగాణ -డిచ్ పల్లి
ఆదివారం హైదరాబాద్ లోని తుక్కు గుండె లో నిర్వహించనున్న కాంగ్రెస్ విజయ బేరి భారీ బహిరంగ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దిమ్మ తిరిగే విధంగా నిర్వహిస్తుందని ఈ సభలోనే ప్రజలకు ఆరు గ్యారెంటీ స్కీమ్ కార్డు ను ప్రవేశపెట్టి అధికారంలోకి వచ్చిన 100 రోజులు లోపే చేసి చూపుతామని, ఇది పోరుగునే ఉన్న కర్ణాటకలో అమలు చేసి చూపుతున్నామని, కాంగ్రెస్ పార్టీ ఏదైనా హామీ ఇస్తే దాన్ని ఆరు నూరైనా పూర్తి చేస్తుందని మాజీ ఎమ్మెల్సీ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు. శనివారం ఇందల్ వాయి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎందరో అమర వీరుల త్యాగాలతో ప్రత్యక రాష్ట్ర అంకాక్ష ను సోనియాగాంధీ నేరవేర్చారని, కాంగ్రెస్ వాస్తే ఎలాంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి చేస్తామో గ్యారంటీ కార్డు ప్రతి గడప గడపకు అందజేస్తామని సూచించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని ఏడు మండలాలలో అన్ని గ్రామాల నుండి భారీ ఎత్తున హైదరాబాద్లో జరిగే విజయభేరి సభను విజయవంతం చేయడానికి స్వచ్ఛందంగా ప్రజలే ముందుకు వస్తున్నారని 500 వాహనాలలో తరలి వెళ్ళడం జరుగుతుందన్నారు. కనివిని ఎరుగని రీతిలో హైదరాబాదులో జరిగే భారీ బహిరంగ సభకు సుమారు పది లక్షల మందితో విజయభేరి కాంగ్రెస్ సభలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నాయకత్వంలో 6 గ్యారంటీ కార్డులు ప్రకటించడం జరుగుతుందని ఆయన తెలిపారు. 10ఏళ్ళ బిఆర్ఎస్ పాలనలో ప్రజలు విసుకు చెందారని, కెసిఆర్ ని గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కల్వకుంట్ల కుటుంబమే రాష్ట్రంలో బాగుపడిందని ఎక్కడ చూసినా ఇచ్చిన ఎ హామీ నెరవేర్చకుండా అభివృద్ధి చేయకుండా ఇన్ని రోజులు మభ్య పెట్టారని భూపతి రెడ్డి ఎదేవ చేశారు. రూరల్ నియోజకవర్గం నుండి సుమారు 4,000 మందితో సభకు బయలు దేరుతామని గ్రామాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళలు, పెద్ద సంఖ్యలో విజయబేరీ సభకు పాల్గొని విజయవంతం చేయాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కోరారు. ఈ విజయభేరి సభ కు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తో పాటు అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుందని విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అనుసరించాల్సిన ఆరు గ్యారెంటీ కార్డులను పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆధ్వర్యంలో ప్రకటించడం జరుగుతుందని తెలిపారు.అదివారం ఉదయం 10 గంటలకు రూరల్ లోని 7 మండలాలకు చెందిన వాహనాలు ఇందల్ వాయి పోలిస్ స్టేషన్ వద్ద నుండి బయలు దేరుతరని వివరించారు. ఆర్టీసీకి బస్సులు అద్దె గురించి అడిగిన ఇవ్వడానికి నిరాకరించడంతో ఆశించిన మేరకు గ్రామాలకు బస్సులను తరలించా లేక పోతున్నామని భూపతి రెడ్డి వివరించారు.ఈ సమావేశంలో ఇందల్ వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్స మోహన్ , ఎస్టీ సెల్ అధ్యక్షులు అంబర్ సింగ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నారాయణ, ఖాజా హబిబోద్దిన్, మల్లేష్, మోహన్, నాయకులు పాల్గొన్నారు.