– ఇండియన్ అంబాసిడర్ అమిత్కుమార్తో మంత్రి శ్రీనివాస్గౌడ్ భీటి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దక్షిణ కొరియా తరహాలోనే తెలంగాణలో పర్యాటకాభివృద్ధి చేస్తామని మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. మంత్రి శ్రీనివాస్గౌడ్తో రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోని ఇండియన్ అంబాసిడర్ అమిత్కుమార్ బుధవారం భేటీ అయ్యారు. కొరియా మాదిరిగా అమ్యూజ్మెంట్ పార్కులు, అడ్వెంచర్ టూరిజం, చిల్డ్రన్స్ పార్కులను తెలంగాణలో ఏర్పాటు చేస్తామన్నారు. దక్షిణ కొరియాలో పర్యాటక, క్రీడా రంగాల్లో జరిగిన అభివద్ధిపై అమిత్కుమార్తో మంత్రి శ్రీనివాస్గౌడ్ చర్చించారు. హైదరాబాద్లోని టాంక్బండ్, బుద్వెల్, గండిపేట తదితర పర్యాటక ప్రాంతాల్లో ఏర్పాటుకు దక్షిణ కొరియా తరహాలో పర్యాటకాభివద్ధి కోసం పూర్తి సహకారం అందిస్తామని మంత్రికి అమిత్ కుమార్ హామీనిచ్చారు. క్రీడా మైదానాలలో మౌలిక సదుపాయాల కల్పనకు, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటకాభివద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ పాల్గొన్నారు.