నవతెలంగాణ-హైదరాబాద్ : బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారి కూతుళ్లను చంపేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓల్డ్ బోయిన్ పల్లి భవాని నగర్లో ఈ విషాదం చోటు చేసుకుంది. శ్రీకాంతా చారి(42) అనే వ్యక్తి తన ఇద్దరు కూతుళ్లు స్రవంతి (8), శ్రావ్య (7)లకు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఇచ్చి తాను కూడా వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురూ మరణించడంతో బోయినపల్లిలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతోనే శ్రీకాంతాచారి ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.