నవతెలంగాణ గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని విఠల్నగర్కు చెందిన ఎలిగేటి శంకర్ (56)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తన కుమార్తె వివాహం బుధవారం స్థానిక సింగరేణి కమ్యూనిటీ హాల్లో ఘనంగా జరిగింది. వివాహ వేడుక ముగిసి బంధువులు, కుటుంబ సభ్యులతో పెండ్లి మండపంలో అందరితో సరదాగా గడిపి, కుమార్తె పెండ్లి కండ్లరా చూసిన శంకర్ అలసటగా ఉండి కుర్చీలో కూర్చున్నాడు. కొద్ది సేపటికి కూర్చున్న కుర్చీలోనే కుప్పకూలాడు. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే శంకర్ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శంకర్.. ఆ కారణంగానే మృతి చెంది ఉంటాడని బంధువులు భావిస్తున్నారు. శంకర్ మృతితో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.