నవతెలంగాణహైదరాబాద్: హయత్నగర్ లెక్చరర్స్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. కారు కిందపడి మూడేళ్ల చిన్నారి లక్ష్మి మృతి చెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లెక్చరర్స్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో పనిచేసేవాళ్లు తమ మూడేళ్ల కుమార్తెను పార్కింగ్ స్థలంలో పడుకోబెట్టారు. అదే అపార్ట్మెంట్లో నివాసముండే ఓ వ్యక్తి కారును రివర్స్ తీస్తుండగా చిన్నారి టైరు కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.