నవతెలంగాణ హైదరాబాద్: దేవరగట్టు కర్రల సమరం(బన్ని ఉత్సవం) విషాదాన్ని మిగిల్చింది. కర్రల సమరాన్ని చూసేందుకు చెట్టు ఎక్కిన యువకుడు ప్రమాదవశాత్తూ చెట్టు కొమ్మ విరిగి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. ఈ బన్ని ఉత్సవం చూసేందకు కొందరు స్థానికులు సమీపంలోని చెట్టు ఎక్కారు. ఈ క్రమంలో గణేశ్ అనే యువకుడు కిందపడి మృతి చెందాడు. ఈ సమరంలో 100 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఓ చేతిలో కర్ర.. మరో చేతిలో దివిటీలు.. మది నిండా భక్తిభావంతో డిర్ర్ర్.. గోపరాక్.. అనే శబ్దాలతో దేవరగట్టు మారుమోగింది. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తూ బన్ని ఉత్సవాన్ని మంగళవారం అర్ధరాత్రి కొనసాగించారు.