నవతెలంగాణ- కంఠేశ్వర్ :
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూటుమెంటు బోర్డు నిర్వహిస్తున్న సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ప్రక్రియా కార్యక్రమం ఇంచార్జీ పోలీస్ కమీషనర్ అదనపు డి.సి.పి (లా అండ్ ఆర్డర్ ) ఎస్. జయ్ రామ్ ఆదేశాల మేరకు నోడల్ అధికారి సి.సి.ఆర్.బి ఎ.సి.పి ఎ. రవీంధర్ రెడ్డి ఆద్వర్యంలో గురువారం ఉదయం 9 గంటల నుండి పోలీస్ పరేడ్ గ్రౌండ్ యందు సర్టిఫికేటు వెరిఫికేషన్ ప్రక్రియా నిర్వహించడం జరుగుతుంది.ఈ సందర్భంగా అభ్యర్ధులు తమ సర్టిఫికేట్లను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది.మొదటి రోజుకు 400 మంది అభ్యర్థులను పిలవగా అందులో 390 మంది అభ్యర్థులు హజరు కాగ వారి ద్రువ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎ.సి.పి నారాయణ, పరిపాలన అధికారి ( ఎ.ఓ ) బి. శ్రీనివాస్, ఆఫీస్ సూపరింటెండెంటులు శంకర్, మక్సూద్ హైమద్, గోవింద్ సి.పి.ఓ కార్యాలయం సిబ్బంది, రిజర్వు విభాగం సిబ్బంది ఐ.టి కోర్ సిబ్బంది పాల్గొన్నారు