కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. కీసర సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం మల్యాల వేణుమాధవ్ సోదరుడి కుమార్తె అయిన కుమారి మల్యాల తుషార, వయస్సు: 18 సంవత్సరాలు, శామీర్పేటలోని విశ్వ విశ్వాని కళాశాలలో బిబిఎ మొదటి సంవత్సరం చదువుతోంది. రోజూలాగే శుక్రవారం ఉదయం కాలేజీ వెళ్ళింది, సాయంత్రం కాలేజీ ముగించిన తర్వాత, ఆమె తన క్లాస్మేట్స్ ఇంద్రకంటి హరిప్రియ ,స్నేహితులు భవేష్ రావు, రూబెన్ ,ఫిలిప్ జాన్లతో కలిసి ఫిలిప్ జాన్ యొక్క బాలెనో కారులో రాత్రి 11:40 గంటలకు లాంగ్ డ్రైవ్కు వెళ్లారు. ఫిలిప్ జాన్ కారును నడుపుతుండగా, వీబీసీటీ, బొల్లారం నుంచి శామీర్పేటకు, ఆపై కీసరకు వెళ్లారని, శనివారం ఉదయం 04:30 గంటల ప్రాంతంలో కీసర సమీపంలోని లలిత కన్వెన్షన్ హాల్ శామీర్పేటకు వెళుతుండగా, ఫిలిప్ జాన్ అతివేగం ,అజాగ్రత్తగా నడపడం వల్ల కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్లను వేగంగా డీ కొట్టగా, వెనుక సీటులో కూర్చున్న తుషార, భవేష్రావులకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ముగ్గురు రూబెన్, ఫిలిప్, హరిప్రియ గాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.