నవతెలంగాణ – హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం, బైక్ ఢీకొట్టుకున్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మేడ్చల్ చెక్పోస్ట్ – కిష్టాపూర్ మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతులను మేడ్చల్ మండలం రావల్కోల్ వాసులైన భాను, హరికృష్ణగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.