నవతెలంగాణ – జునాగడ్: గుజరాత్లోని జునాగడ్లో జరిగిన తాజా హింసాత్మక ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. రాళ్లు రువ్విన ఘటనలో ఓ కొందరు పోలీసులు గాయపడ్డారు. అక్రమ రీతిలో నిర్మించిన మసీదును తొలగించేందుకు యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ చేపట్టారు. ఆ సమయంలో ఘర్షణలు తలెత్తాయి. నిరసన చేపడుతున్న స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గుంపును చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్కు దిగారు. నగరంలోని మేజెవాడి గేటు వద్ద నిర్మించిన మసీదుకు వారం క్రితమే జునాగడ్ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చినట్లు ఎస్పీ రవి తేజ తెలిపారు. ఆ నిర్మాణానికి సంబంధించిన డాక్యుమెంట్లను అయిదు రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించారు.