– పర్మినెంట్ ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలి : జీహెచ్ఎంసీ కార్మిక సంఘాల డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులు, వివిధ కేటగిరీ ఉద్యోగుల వేతనాలను పెంచాలనీ జీహెచ్ఎంసీ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. సోమవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జేఏసీ సమావేశం ఏసురత్నం (ఏఐటీయూసీ సీనియర్ నేత) అధ్యక్షతన జరిగింది. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. జేఏసీ కార్యాచరణను వివరించారు. యాజమాన్యం దిగివచ్చే వరకు డిమాండ్లపై జేఏసీ భాగస్వామ్య సంఘాలు విశాల దృష్టితో పనిచేయాలని కోరారు. సమావేశంలో జె. వెంకటేష్ (సిఐటియు రాష్ట్ర కార్యదర్శి), రెబ్బా రామారావు (హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), అంజాద్, శ్రీనివాస్ (హెచ్ఎంఎస్), శంకర్ (బిఎంఎస్, జిహెచ్ఎంసి నాయకులు) పాల్గొన్నారు. ఆర్. వాణి, మల్లేష్, నర్సిరెడ్డి (సిఐటియు), జైపాల్ రెడ్డి, ఆనంద్, వెంకటయ్య, కిషన్ (ఏఐటియుసి) తదితరులు పాల్గొన్నారు.
జేఏసీ కార్యాచరణ ఇదే
ఈ నెల 24న ఉద్యమ కార్యాచరణ కోసం జెఏసి సమావేశం.
25న జీహెచ్ఎంసీ కమిషనర్ సంబంధిత అధికారులకు మెమోరాండం సమర్పణ
ఆగస్టు 28 నుంచి జోనల్, సర్కిల్ కార్యాలయాల వద్ద ధర్నాలు – సభలు.
ప్రభుత్వ వైఖరిని బట్టి తదుపరి సమరశీల కార్యాచరణ నిర్ణయం.