నవతెలంగాణ – రేవల్లి
డీడీలు కట్టించి గొర్రెలు పంపిణీ చేయకుండా గొల్ల కురుమ యాదవులను అప్పుల పాలు చేశారని గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం మండలంలోని నాగపూర్ గ్రామ కమిటీ విమర్శించింది. శనివారం గొర్రెల సంఘం కమిటీలో డీడీలు కట్టిన సభ్యులు మాట్లాడుతూ, జూన్ 20/2023 న రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభించినట్లు హడావిడి చేయడంతో గొల్ల కురుమ యాదవులన్నలు ( అప్పులు ) తెచ్చి మరి డీడీలు కట్టారని, మొత్తం 107 యూనిట్లతో ఒక యూనిట్ 43,750 చొప్పున డీడీలు గోపాల్ పేట ” డిసిసిబి ” లో డిడి తీసుకున్నామని, ఇట్టి మొత్తం 46 లక్షల 81 వేల 250 పైసలు జిల్లా కలెక్టర్ అకౌంట్ లో బదిలీ చేయడం జరిగిందని తెలిపారు. ఆరు నెలలు గడుస్తున్న ఇందులో ఏ ఒక్కరికి రాకపోవడంతో గొల్ల కురుమలతో డీడీలు కట్టించి, వారిని అప్పుల పాలు చేశారని కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ప్లాన్ లేకుండా వారికి నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం వారిని ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. అధికారులను అడిగితే ఖచ్చితంగా వస్తాయి అని యాదవులను మభ్యపెడుతున్నారని సంఘం యాదవులు మండిపడుతున్నారు. మా దగ్గర కట్టించుకున్న యూనిట్ల 107 మందికి రూపాయలు 46,81,250 లక్షల నిధులు మంజూరు చేసి, నచ్చిన చోట కొనుక్కునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున నిరసనలు చేయవలసి వస్తుందని తెలియజేశారు. జక్క సాయిలు, జక్క ఖాతాలు, దొడ్డి కర్రె మల్లయ్య, కత్తె లక్ష్మన్, జక్క పాపయ్య, కుడికిళ్ల బీరయ్య, డి చెన్నకేశవులు, డి శివ, కే రాముల, జె నాగరాజు, డి రాములు, కే నిరంజన్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.