నవతెలంగాణ -తిరుమల: తిరుపతిలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. మంగళవారం రాత్రి చిరుత, ఎలుగుబంటిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించారు. సుమారు 100 మంది సిబ్బందితో అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగించారు. ఈ క్రమంలో ట్రాప్ నుంచి చిరుత, ఎలుగుబంటి త్రుటిలో తప్పించుకున్నాయి. చిరుత బోన్కు దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్లింది. మరోవైపు ఎలుగుబంటికి మత్తు ఇచ్చి ట్రాప్ చేసేందుకు సిబ్బంది యత్నించగా తప్పించుకుని పారిపోయింది. చిరుత, ఎలుగుబంటిని ట్రాప్ చేస్తే నడక మార్గంలో వన్య మృగాల నుంచి ప్రమాదం తప్పినట్లేనని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.