నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం ఈ పరీక్ష ఫలితాలను ఎస్ఎస్సీ బోర్డు అధికారులు విడుదల చేశారు. పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో 80.59 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. జూన్ 14 నుంచి ఈ పరీక్షలు జరగ్గా.. 66,732మంది విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే.
అలాగే ఇంటర్ మొదటి, ద్వితియ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు కూడా ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఈ పరీక్షలు జూన్ 12 నుంచి 20 వరకు జరిగాయి. తక్కువ సమయంలోనే ఫలితాలను విడుదల చేశారు.