– ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు: డా.హిప్నో పద్మా కమలాకర్
నవతెలంగాణ – హైదరాబాద్
స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని ఆగష్టు 15 స్కూల్లో, కాలేజీల్లో పోటీలు నిర్వహిస్తున్నామని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్ తెలిపారు. డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో విలేఖరులతో మాట్లాడారు. ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, నవభారత లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో దేశభక్తి గీతాలు, పద్యాలు, పాటలు, జాతీయ సమర యోధులపై వ్యాసరచన పోటీలు, ప్రభుత్వ స్కూల్లో, కాలేజీల్లో పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తారని తెలిపారు. మనము ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ప్రతిఫలమన్నారు. బహుమతులు అందజేసే రోజున క్లబ్ 2వ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డా.మహేంద్ర కుమార్ రెడ్డి, సి.హెచ్.గోపాల కృష్ణ, అధ్యక్షుడు బి.వినయ్, పి.స్వరూపా రాణి, జి.కృష్ణవేణి పాల్గొంటారన్నారు.
– డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్ సైకో థెరపీస్ట్ హిప్నో థెరపీస్ట్
9390044031