నవతెలంగాణ డేహ్రాడూన్: ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడంతో 15 మంది దుర్మరణం చెందారు. ఉత్తరాఖండ్లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం చమోలీ జిల్లాలోని అలకనందా నది ఒడ్డున ఈ ఘోరం జరిగింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.