నవతెలంగాణ – న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో హైవేపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ తరుణంలో బద్రీనాథ్ టూరిస్టులు చిక్కుకుపోయారు. భారీ వర్షం వల్ల ఆ ప్రాంతంలో కొండచరియలు కూలాయి. చమోలీ జిల్లాలోని చిన్కా వద్ద ఈ ఘటన జరిగింది. మరో వైపు ఉత్తరాఖండ్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ హెచ్చరించింది. ఈ రోజు ఉదయం ఢిల్లీలో కూడా వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు జామైంది. మనాలీలో దాదాపు 300 మంది టూరిస్టులు మూడు రోజుల పాటు ఎటూ కదలలేకపోయారు. దాదాపు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది.