నవతెలంగాణ- హైదరాబాద్: మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి డా. ప్రియ గుండెపోటుతో మరణించారు. ఆమె 8 నెలల నిండు గర్భిణి కావడం గమనార్హం. నిన్న రాత్రి వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లిన ప్రియకు హార్ట్ ఎటాక్ రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. దీంతో వైద్యులు ఆపరేషన్ చేసి శిశువును బయటికి తీశారు. అనంతరం ప్రియ మరణించిందని.. శిశువు ICUలో చికిత్స పొందుతోందని నటుడు కిశోర్ సత్య సోషల్ మీడియాలో వెల్లడించారు.