– 471745 మంది పురుషులు 494650 మంది మహిళలు
– వయోవృద్ధులకు ఇంటి నుండి ఓటు హక్కు వినియోగం
– అక్రమాలకు పాల్పడితే సి.విజిల్ యాప్లో ఫిర్యాదు చేయండి
– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల
నవతెలంగాణ-పాల్వంచ
శాసనసభ ఎన్నికలకు నామినేషన్లు పరిశీలన ఉపసంహరణ అనంతరం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 90 మంది అభ్యర్థులు పోటీలో నిలిచినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయపు మినీ సమావేశం హాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు పోస్టల్ బ్యాలెట్ ఫారం 12 డి.ఓటర్ సమాచార స్లిప్పులు పంపిణీ వెబ్ కాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులు, శాంతిభద్రతలు పర్యవేక్షణ పరిశీలకులు తదితర అంశాలపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 3న నుండి పదవ తేదీ వరకు ఐదు నియోజకవర్గాల 136 మంది అభ్యర్థులు 2011 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారని చెప్పారు. 13న పరిశీలనలో 16 మంది అనర్హులుగాను 15న 25 మంది నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. పినపాకలో 18 మంది, ఇల్లందులో 20, కొత్తగూడెంలో 30,అశ్వరావుపేటలో 14, భద్రాచలంలో 13 మంది మొత్తం 95 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు చెప్పారు. వీరిలో గుర్తింపు పొందిన రాష్ట్ర జాతీయ పార్టీల నుండి 20 మంది రిజిస్టార్ పొలిటికల్ పార్టీలు గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలు 36 కాకుండా స్వతంత్ర అభ్యర్థులు 47 మంది ఉన్నట్లు చెప్పారు. ఈనెల 10న ప్రకటించిన తుది ఓటర్ జాబితా ప్రకారం జిల్లాలో 47,1745 మంది పురుషులు 594650 మంది మహిళలు 44 ఇతరులు మొత్తం 96,6439 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. వీరిలో 732 మంది సర్వీస్ ఓటర్లు, దివ్యాంగులు 13678 మంది, 18-19 సంవత్సరాల వయసున్న 27,490 మంది 80 సంవత్సరాలు పైబడిన వారు 13106 మంది ఉన్నట్లు చెప్పారు. ఎన్నికల్లో విధులు నిర్వహించి సిబ్బందికి 4500 పోస్టల్ బ్యాలెట్లు అలాగే దివ్యాంగులకు 80 సంవత్సరాలు పైబడిన వయవృద్ధులు 725 పోస్టల్ బ్యాలెట్లకు దరఖాస్తు వచ్చినట్లు చెప్పారు. దివ్యాంగులకు 80 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులు ఇంటి నుండి ఓటు హక్కు వినియోగానికి ఈనెల 20వ ప్రతి రిటర్నింగ్ అధికారి కార్యాలయం ద్వారా షెడ్యూల్ తయారు చేయనున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు బూతు స్థాయి అధికారులు పోలింగ్ ఏజెంట్లతో ఇంటికెళ్లి వీడియో గ్రాఫిక్ ద్వారా ఓటు హక్కు వినియోగానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
1095 పోలింగ్ కేంద్రాల్లో 300 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. 512 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షణకు వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 2,93, 73,711 నగదు 2,48, 01,333 మద్యం ఇతర వస్తువులు మొత్తం కలిపి 6,85,11,795 కోట్లు సీజ్ చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఎన్నికల పర్యవేక్షణకు ముగ్గురు సాధారణ పరిశీలకులు ఇద్దరు వ్యయ పరిశీలకులు శాంతిభద్రతల పర్యవేక్షణకు ఇద్దరు పర్యవేక్షకులను ఎన్నిక సంఘం నియమించినట్లు చెప్పారు. పినపాక ఇల్లందు నియోజకవర్గాలకు సాధారణ పరిశీలకులుగా నియమితులైన హరికిషోర్ ఉదయం 9-10 గంటల మధ్య ఐటీసీ విశ్రాంతి భవనం సారపాక, బూర్గంపాడు మండలంలోని ప్రజలకు రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంటారని 6303713285 కొత్తగూడెంనకు నియమించిన సాధన పరిశీలకులు కమల్ కిషోర్ ప్రతిరోజు సాయంత్రం 4-5 గంటల వరకు సింగరేణి విశ్రాంతి భవనం ఇల్లందు గెస్ట్ హౌస్ నందు ప్రజలకు రాజకీయ పార్టీల అందుబాటులో ఉంటారని 6303743371 ఫోన్ నెంబర్ చెప్పారు. అలాగే భద్రాచలం, అశ్వరావుపేట నియోజకవర్గం సాధారణ పరిశీలకులుగా నియమితులైన ఎస్.గణేష్ సింగరేణి విశ్రాంతి భవనం ఇల్లందు గెస్ట్ హౌస్ నందు సాయంత్రం 5-6 మధ్య పరిశీలనకు రాజకీయ పార్టీల ప్రతినిధులకు 6303715534 ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంటారని చెప్పారు ఎన్నికలకు సంబంధించిన అంశాలపై నేరుగా కలిసి ఫిర్యాదు చేయవచ్చునని ఆమె సూచించారు.