నవతెలంగాణ -పెద్దవూర : కన్న తండ్రికి తలకొరివి పెట్టే కొడుకే కాసాయి గా మారాడు. అతి దారుణంగా తండ్రిని హత్య చేశాడు. ఈ దారుణమైన సంఘటన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం లో చోటు చేసుకుంది. ఎస్ఐ అజ్మీర రమేష్ తెలిపిన వివరాలప్రకారం మండలంలోని పోతునూరు గ్రామానికి బొడ్డు వెంకటయ్య కు ముగ్గురు కుమారులు వున్నారు. పెద్దకొడుకు బొడ్డు రాజబాబు (38) అను అతను లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.రెండవ కొడుకు కిరణ్ హైదరాబాద్ లో అపార్టు మెంటులో సెక్యూరిటీ గార్డు గా పని చేస్తూ భార్య పిల్లలతో జీవనం సాగిస్తున్నారు. చిన్నకొడుకు మహేష్ అవివాహితుడు అతను పీఏ పల్లి మండలం రూళ్ళ పహాడ్ లో వుంటున్నాడు. నిందితుడు పెద్ద కొడుకు రాజాబాబు లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.ఐదు సంవత్సరాల క్రితం భార్యతో గొడవలు పడి, భార్య పిల్లలను వదిలేసి ప్రస్తుతం తన తల్లిదండ్రుల తో కలిసి గత కొంత కాలంగా పోతునూర్ లో ఉంటున్నాడు. తరచుగా రాజబాబు తన తల్లితండ్రుల తో గొడవలు పడుతూ వారిని ఇబ్బంది పెట్టేవాడు. అదే క్రమంలో ఈనెల 11న బుధవారం ఉదయం 11 గంటల సమయంలో రాజబాబు తన తండ్రి వెంకటయ్య (55) తో మళ్ళీ గొడవపడి అతన్ని రాయితో తలపై కొట్టాడు.అదే సమయం లో రెండు సార్లు ఇంటిముందు సిమెంట్ రోడ్డుపై ఎత్తి బలంగా ఇసిరి వేశాడు. ఈ ఘటనలో వెంకటయ్యకు తలకు గాయమై సృహ తప్పి పడిపోయాడు. అతన్నివెంటనే నాగార్జున సాగర్ ఆసుపత్రికి తరలించారు.పరిస్థితి విషమంగా ఉండడం తో అతనిని హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి కి తరలించి చికిత్స చేయిస్తుండగా బుధవారం సాయంత్రo సుమారు 05 గంటల సమయం లో చనిపోయారు.మృతుడి భార్య వెంకటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమారులు ఒక కూతురు వున్నారు.మృతుని పోస్టు మార్టం నిమిత్తం నాగార్జున సాగర్ కమలా నెహ్రు అసువత్రికి తరలించామని తెలిపారు.