#WATCH | At least five people died in a bus accident in Assar region of Doda in J&K. Injured shifted to District Hospital Kishtwar and GMC Doda. Details awaited. pic.twitter.com/E3WWXyhv5f
— ANI (@ANI) November 15, 2023
నవతెలంగాణ – జమ్మూ కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దోడా జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, రెస్క్యూ బృందం క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. బటోట్-కిష్త్వార్ జాతీయ రహదారిపై ట్రుంగల్-అస్సార్ సమీపంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు జమ్మూ డివిజన్ కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. బస్సు రోడ్డుపై నుంచి 300 అడుగుల లోతులో పడిపోయినట్లు చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెప్పారు. ఇప్పటి వరకూ ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని, పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందం వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాచయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మరోవైపు గాయపడిన వారిని తరలించేందుకు హెలికాప్టర్ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.