నవతెలంగాణ-నసురుల్లాబాద్: అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యమని నసురుల్లాబాద్ మాజీ ఎంపీటీసీ ఫోరం కన్వీనర్ కంది మల్లేష్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి అభివృద్ధి సంక్షేమ పథకల వివరాలను వివరించారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మైలారం సొసైటీ చైర్మన్ మండల పార్టీ అధ్యక్షుడు పెరిక శ్రీనివాస్ మాట్లాడుతూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. బాన్సువాడ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మరోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఆయన అన్నారు. పోచారం ను భారీ మెజార్టీతో గెలిపించవలసిన బాధ్యత కార్యకర్తలపై ఎంతైనా ఉందన్నారు. ప్రతి కార్యకర్త సైనికునిగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మి ప్రజలు మోసపోకుండా చూడవలసిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు, రాంబాబు,
సాయిలు నర్సింలుగౌడ్, మైషా గౌడ్, అజ్గర్ అలీ, గంగారం తదితరులు పాల్గొన్నారు.