నవతెలంగాణ – ముంబాయి: ముంబాయిను త్వరలో పేల్చివేయనున్నట్లు ఓ వ్యక్తి బెదిరించాడు. మే 22వ తేదీన ఉదయం 11 గంటలకు ముంబై పోలీసులకు ఆ మెసేజ్ అందింది. ట్విట్టర్లో బెదిరింపునకు పాల్పడిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ వ్యక్తి గురించి ఆరా తీసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బెదిరింపు మెసేజ్ చేసిన ఆ వ్యక్తిని మరింత లోతుగా విచారించనున్నారు. ఈ ఘటన గురించి ముంబాయి పోలీసులు త్వరలో మరింత సమాచారాన్ని వెల్లడించనున్నారు.