నవతెలంగాణ-హైదరాబాద్ : కేరళలోని గుళ్ల ప్రాంగణాలలో ఆర్ఎస్ఎస్ కవాతులు, ఇతరత్రా కార్యకలాపాలను తిరువనంతపురం దేవస్థానం బోర్డ్(టిడిబి) నిషేధిస్తూ సర్కులర్ జారీచేసింది. దక్షిణాదిన తిరువనంతపురం దేవస్థానం బోర్డు దాదాపు 1200 గుళ్లను మేనేజ్ చేస్తోంది. టిడిబి జారీ చేసిన సర్కులర్లో రాష్ట్రంలోని అన్ని గుళ్లు తిరువనంతపురం దేవస్థానం బోర్డు నియంత్రణలో ఉంటాయే తప్ప, ఆర్ఎస్ఎస్ నియంత్రణలో కాదని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ ఎలాంటి కార్యకలాపాలను గుళ్ల ప్రాంగణాలలో నిర్వహించరాదని స్పష్టం చేసింది. తిరువనంతపురం దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కె. అనంతగోపన్ మీడియాతో మాట్లాడుతూ ‘గుళ్లలో వేడుకలు జరుగుతున్నందున మేము ఎలాంటి పరిశోధనలు చేయలేదు. కేవలం ఆర్ఎస్ఎస్ అనే కాదు, ఇతరులు కూడా జోక్యం చేసుకుంటున్నారు. దానిని మేము వ్యతిరేకిస్తున్నాం’ అన్నారు. 2021 మార్చిలో కూడా ఇలాంటి సర్కులర్నే హెచ్చరిస్తూ విడుదలచేశారు. 2016లో అయితే దేవస్థానం బోర్డు ఆర్ఎస్ఎస్ తాలూకు అన్ని ఆయుధాల శిక్షణను నిషేధిస్తూ సర్కులర్ జారీ చేసింది. ఇక తాజాగా