నవతెలంగాణ-హైదరాబాద్: రాజకీయాల నుంచి రిటైర్డ్ అవుదామని అనుకుంటున్నట్లు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో ఉత్తమ్ మాట్లాడుతూ.. కమర్షియల్ రాజకీయాలకు తాను సెట్ కానని అన్నారు. ఏదో ఒక మంచిరోజు చూసుకొని రాజకీయాల నుండి రిటైర్డ్ అవుదామని అనుకుంటున్నట్లు తెలిపారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తాయని అనుకుంటున్నానని అన్నారు. మోదీ చరిష్మతో ఎన్నికలకు వెళ్దామని బీజేపీ అనుకుంటుందని.. రెండు ఎన్నికలు ఒకేసారి వస్తే కాంగ్రెస్కే లాభమని చెప్పుకొచ్చారు. శరత్ రెడ్డి అప్రూవర్గా మారితే లిక్కర్ కేసు సీరియస్గా టర్న్ అవుతుందన్నారు. శరత్ రెడ్డి నిజంగా అప్రువర్ గా మారితే అది ఆప్కు చావుదెబ్బ అని ఎంపీ చెప్పుకొచ్చారు.