నవతెలంగాణ – హైదరాబాద్
టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టులో ఓపెనర్గా అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా వార్నర్ నిలిచాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులు చేసిన వార్నర్.. ఈ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు 105 టెస్టులు ఆడిన వార్నర్ ఓపెనర్గా 8,208 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ను వార్నర్ అధిగమించాడు. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన జాబితాలో సెహ్వాగ్(8,207) ఐదో స్ధానంలో ఉండగా.. తాజా మ్యాచ్తో ఆ స్ధానాన్ని డేవిడ్ భాయ్ కైవసం చేసుకున్నాడు. ఇక ఓవరాల్గా ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలస్టర్ కుక్(11, 845) తొలి స్ధానంలో ఉండగా.. ఆ తర్వాతి స్ధానాల్లో వరుసగా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్(9,607), గ్రేమ్ స్మిత్(9,030), మథ్యూ హేడన్(8,625) పరుగులతో ఉన్నారు.