నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ గాయకుడు, ఉద్యమకారుడు, తెలంగాణ వేర్ హౌజ్ కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ (39) గుండెపోటుతో హఠాన్మరణం పాలైన విషయం తెలిసిందే. ఆయన భౌతిక కాయాన్ని ప్రముఖ రాజకీయ నేతలంతా సందర్శిస్తున్నారు. కాసేపటి క్రితం సీఎం కేసీఆర్ కూడా ప్రగతి భవన్ నుంచి నేరుగా సాయిచంద్ నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించారు. సాయిచంద్ భౌతిక కాయాన్ని చూసి సీఎం కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతకు ముందు మంత్రి కేటీఆర్, హరీష్రావులు సైతం సాయిచంద్ భౌతిక కాయాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.