నవతెలంగాణ- హైదరాబాద్: తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వొద్దంటూ గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. గోదావరి బేసిన్లో నిర్మించే ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని, డీపీఆర్లను పరిశీలన కూడా చేయొద్దని విజ్ఞప్తి చేస్తూ ఏపీ జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ బోర్డుకు లేఖ రాశారు. త్వరలోనే గోదావరి బోర్డు సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో సమావేశంలో చర్చించే ఎజెండాను పంపాలని కోరగా ఏపీ ఈ లేఖను రాసింది.