– తెలంగాణ యూనివర్సిటీల జేఏసీ
– చైర్మైన్ సీమర్ల విజేందర్ రెడ్డి
నవతెలంగాణ-ఓయూ
యూనివర్సిటీలతరపు నుంచియూని వర్సి టీలో పనిచేస్తున్న ఉద్యోగుల గురించి విద్యార్థు లకు ఉన్నత విద్య అందించడానికి అన్ని రాజకీ య పార్టీలు తమ సమస్యలను తమ తమ రాజకీయ మానిఫెస్టోలో చేర్చాలని అభ్యర్థిస్తు న్నామని తెలంగాణ యూనివర్సిటీ జేఏసీ చైర్మె న్ సీమర్ల విజేందర్రెడ్డి కోరారు. మంగళవారం ఓయూ ఇంజనీరింగ్ కళాశాల ఎదుట అయిన పోస్టర్స్ విడుదల చేశారు. వారు మాట్లాడుతూ యూనివర్సిటీలలో చదివే ప్రతి విద్యార్థికి ఉచిత విద్య, ఉచిత వసతి కల్పించాలని, సెల్ప్ ఫైనా న్స్ కోర్సులన్నింటినీ రెగ్యుల ర్ కోర్సులుగా మార్చాలని, యూ నివర్సిటీలో రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులలో పని చేస్తు న్న కాంట్రాక్టు ప్రొఫెసర్లను ఉద్యోగులను రెగ్యులర్ చేయాల న్నారు. యూనివర్సి టీలలో పని చేస్తు న్న పర్మినెంట్ ప్రొఫెసర్లకి ఉద్యోగు లకు పాత పెంక్షన్ స్కీ ములను అమ లు చేయా లని కోరారు. యూనివర్సి టీలలో పనిచేస్తున్న రెగ్యు లర్ కాం ట్రాక్టు ప్రొఫెసర్లకి, ఉద్యోగు లకు హెల్త్ కార్డులను ఇవ్వాలని సూ చిం చారు. యూనివ ర్సిటీలలో పని చేస్తున్న పర్మనెంట్ ప్రొఫెసర్లకి 7వ సవరణ పే స్కేల్ బకాయిలను చెల్లించాలి, యూని వర్సిటీలకు బ్లాక్ గ్రాంట్స్ పెంచాలని తెలం గాణ యూ నివ ర్సిటీల జేఏసీ సీమర్ల విజేందర్ రెడ్డి కోరా రు. కార్యక్రమంలో ఎ.అశో క్, రామ లింగయ్య, విద్యార్థులు, ఎండ్.ఖాన్, ఓంకార్, నాగవేణి తదితరులు పాల్గొన్నారు.