డైరెక్టర్ కె. విజయభాస్కర్ చాలా విరామం తర్వాత చేస్తున్న యూత్ ఫుల్ ఫన్ అండ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ ‘జిలేబి’. పారిశ్రామికవేత్త గుంటూరు రామకష్ణ ఎస్ఆర్కే ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అంజు అశ్రాని చిత్రాన్ని సమర్పిస్తున్నారు. విజయభాస్కర్ తనయుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ నాయికగా నటిస్తోంది. రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
‘ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇదొక హిలేరియస్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ అని టీజర్ భరోసా ఇచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఆకు పాకు’ అనే పాటని మేకర్స్ విడుదల చేశారు. మణిశర్మ ఈ పాటని క్యాచీ నెంబర్గా కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం మరో ఆకర్షణగా నిలిచింది. రాహుల్ సిప్లిగంజ్ ఎనర్జిటిక్గా పాడిన ఈ పాటలో లీడ్ పెయిర్ కంగారు పడుతూ పరుగులు తీయడం థ్రిల్లింగ్గా ఉంది’ అని చిత్ర బృందం తెలిపింది. మురళీ శర్మ, గెటప్ శ్రీను, గుండు సుదర్శన్, బిత్తిరి సత్తి తదితరులు నటిస్తున్నారు.