నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలు – కర్నూల్ రోడ్లోని ఓ పవర్ ఆఫీస్లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. ట్రాన్స్ఫార్మర్ పేలడంతో.. చుట్టూ ఉన్న పరికరాలతో పాటు పక్కనే రూమ్లోకి మంటలు వ్యాపించాయి. దీంతో.. ఆఫీస్ ఆవరణలో ఉన్న పాత స్క్రాప్ మొత్తం మంటల్లో దగ్ధమైంది. మంటలు చెలరేగిన వెంటనే సమాచారం అందించడంతో.. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి, సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. రెండు అగ్నిమాపక వాహనాలు చేరుకొని.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ, ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.