నవతెలంగాణ – ఖమ్మం: ఓ యువకుడు జిమ్కి వెళ్లొచ్చిన కాసేపటికే గుండెపోటుతో కుప్పకూలాడు. ఈ ఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మంలోని బాలపేటకు చెందిన శ్రీధర్ ఈ ఉదయమే జిమ్కు వెళ్లి, ఇంటికి తిరిగొచ్చాడు. ఆ తర్వాత కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇంట్లోనే కుప్పకూలాడు. దీంతో కుటుంబ సభ్యులు శ్రీధర్ను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతోనే శ్రీధర్ మరణించినట్లు పేర్కొన్నారు. శ్రీధర్ గతంలో ఓ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందాడు. శ్రీధర్ మృతిపట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలోని అల్లిపురంలో ఆదివారం ఉదయం నాగరాజు(33) అనే యువకుడు కూడా ఇలాగే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.