![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/IMG-20230704-WA0297-1024x576.jpg)
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎబివిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మనోజ్ గారు మాట్లాడుతూ” రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో బోధన, బోధనేతర ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. ప్రపంచవ్యాప్త విద్యార్థులను ఆకర్శించేటంతటి నాణ్యత కలిగిన విద్యాసంస్థలుగా మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలను మరియు విశ్వవిద్యాలయాలను తీర్చిదిద్దాలి. రాష్ట్రంలో మూసివేసిన 8,624 ప్రభుత్వ పాఠశాలలను పునః ప్రారంభించి, ప్రభుత్వ విద్యను పటిష్ట పరచాలి. ఫీజుల నియంత్రణ చట్టం చేసి, ఫీజుల దోపిడీని అరికట్టాలి. విద్య వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలను నిషేధించాలి. ప్రభుత్వ యూనివర్సిటీలలో 75% పైగా ఖాళీగా ఉన్న అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులను భర్తీ చేయాలి. అధిక నిధులు కేటాయించి, పరిశోధనలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయాలి. ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ, అధిక ఫీజులను నియంత్రించాలి. అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ యూనివర్సిటీ భూములు మరియు ప్రభుత్వ విద్యాసంస్థల భూములను పరిరక్షించాలి. పెండింగ్లో ఉన్న స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలి. పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ ను రూ. 3,500 లకు పెంచి ప్రతి నెల విద్యార్థి బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి. ప్రతి విద్యార్థికి షరతులు లేకుండా మొత్తం ఫీజును రీయింబర్స్మెంట్ చేయాలి. సంక్షేమ, గురుకుల వసతి గృహాలకు మరియు ప్రభుత్వ విద్యా సంస్థలకు పక్క భవనాలను నిర్మించి, మెరుగైన మౌళిక వసతులు కల్పించాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,91 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేయాలి, TSPSC ని ప్రక్షాళణ చేస్తూ పటిష్టపరిచి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి. పేపర్ లీకేజ్ నిందితులను కఠినంగా శిక్షించాలి. రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం, మాదకద్రవ్యాలు, మహిళలలపై దాడులు, పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను అరిక శాంతి రైతు ఋణాలను తక్షణమే మాఫీ చేయాలి. పంట బీమాను అమలు చేస్తూ, కల్తీ విత్తనాలను నిరోధించాలి. అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కన్వీనర్ కృష్ణ, నగర కార్యదర్శి చరణ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రోహిత్, సంజయ్, ఖలీల్, శ్రీరామ్, సమీర్, ప్రణీత్, సాయి చరణ్, రాజు, సంతోష్, విక్రమ్ ఆదిత్య, మారుతి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.