నవతెలంగాణ – చెన్నై: సీనియర్ సినీ నటుడు సత్యరాజ్ తల్లి నాదమ్మాళ్ కళింగరాయర్ (94) మృతిచెందారు. వృద్దాప్యంతో పా టు అనారోగ్య సమస్యల కారణంగా ఆమె శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. కోవైలో నివసిస్తూ వచ్చిన ఆమె అక్కడే మృతి చెం దారు. ఆమెకు కుమారుడు సత్యరాజ్, కుమార్తెలు మండ్రాడియార్, రూపా సేతాధిపతి ఉన్నారు. తల్లి మరణ వార్త తెలుసుకున్న నటుడు సత్యరాజ్.. హైదరాబాద్ నుంచి చెన్నైకు హుటాహుటిన బయలుదేరారు. ఆమె అంత్యక్రియలు శనివారం జరుగనున్నాయి. సత్యరాజ్ తల్లి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలుపుతున్నారు.