నవతెలంగాణ- ఆర్మూర్ : నియోజకవర్గంలో ఈ నెల 20 వ తేదిన జరిగే రాహుల్ గాంధీ గారి యొక్క కార్నర్ మీటింగ్ స్థల పరిశీలన కోసం మంగళవారం ఏఐసీసీ కార్యదర్శులు PC విష్ణు ప్రసాద్, రోహిత్ చౌదరి, PCC ఉపాధ్యక్షులు వేం నరేందర్ రెడ్డి, DCC ప్రెసిడెంట్ మానలా మోహన్ రెడ్డి గార్లు. పెర్కిట్ చౌరస్తా, మామిడిపల్లి చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా లను పరిశీలించారు .అంబేద్కర్ చౌరస్తాను ఫైనల్ చేసిన నాయకులు. వీరి వెంట PCC ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకటేష్, పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, నాయకులు మీర్ మాజీద్, వెంకట్రాంరెడ్డి, జిమ్మి రవి, ఫాయీమ్, మీసాల రవి, బట్టు శంకర్, బాల కిషన్, భూపేందర్, ప్రసాద్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.