– మునుగోడు సీపీఐ(ఎం) పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డి
– దోనూరి నర్సిరెడ్డికి మంగళ హారతులు పడుతున్న మహిళలు
– మందోల్లగూడెంలో భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసిన దోనూరు నర్సిరెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం జై కేసారం గ్రామం నుంచి మునుగోడు సీపీఐ(ఎం) పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డి బుధవారం ప్రచారం ప్రారంభించారు. జై కేసారంలో యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి జాంగీర్ మాట్లాడుతూ ప్రజల పక్షాన పోరాటం చేసేది భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్స్ట్ అని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో సిపిఐ సిపిఎం పార్టీలకు నమ్మించి ఓట్లు వేపించుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మతోన్మాద బీజేపీ పార్టీకి ఈ ఎన్నికల్లో ఓడించాలని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సీపీఐ(ఎం) , సిపిఐ మద్దతుతో పదివేల ఓట్లతో గెలిచి ఈరోజు కమ్యూనిస్టు పార్టీలను కెసిఆర్ విస్మరించారని తెలిపారు. ప్రజల పక్షాన కమ్యూనిస్టు పార్టీ అండ దండగా ఉంటుందని రాబోయే మునుగోడు ఎన్నికల్లల్లో సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థిగా నర్సిరెడ్డి గారి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ ఈ చౌటుప్పల్ ప్రాంతంలో కందాల రంగారెడ్డి, జక్కిడి ప్రతాపరెడ్డి, దేప జనార్దన్ రెడ్డి వారసత్వాన్ని ఉనికి పుచ్చుకొని అనేక ప్రజా ఉద్యమాలు సీపీఐ(ఎం) పార్టీ ద్వారా చేశానని తెలిపారు.
మందోల్లగూడెంలో గ్రామంలో భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మతోన్మాద బీజేపీ పార్టీ అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు వారు కమిషన్ల కోసం కాంట్రాక్టుల కోసమో ప్రాకులాడే వ్యక్తులని తెలిపారు. సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థిగా నేను గత 30 సంవత్సరాలుగా ఎర్రజెండా పక్షాన ప్రజల పక్షాన పోరాటాలు చేశానని తెలిపారు. పేద ప్రజల పక్షాన ప్రభుత్వ కార్యాలయల ముందు ప్రజల సమస్యలపైన సీపీఐ(ఎం) పార్టీ పక్షాన అండగా మేము ఉంటామని భరోసా ఇస్తున్నానని నర్సిరెడ్డ తెలిపారు. ఈ ప్రాంతంలో పిలాయిపల్లి కాలువ సీపీఐ(ఎం) పార్టీ పక్షాన ఉద్యమాలు చేసి సాధించుకున్నామని ఇంకా వాటికి పిల్ల కాలువలు వేయలేదని ఆయన తెలిపారు. ఈ ప్రాంతానికి నాయకత్వం వచ్చిన కామ్రేడ్ అమరుడు కందాల రంగారెడ్డి బాటలోనే నడవాలని సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థిగా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించాల్సిన అవసరం ఉందని నర్సిరెడ్డి తెలిపారు. కమ్యూనిస్టులు లేని అసెంబ్లీ పూజారులేని దేవాలయం రెండు ఒకటేనని ఆయన అన్నారు. రోజుకు ఒక పార్టీ మారే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చలమల్ల కృష్ణారెడ్డి లకు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎండి జాంగీర్, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండా శ్రీశైలం, జిల్లా కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, ఎండి పాషా, శ్రీనివాస్ చారి, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్,మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, మండల కమిటీ సభ్యులు రాగిరి కిష్టయ్య, బత్తుల శంకర్ గౌడ్, ఎంపీటీసీలు తడక పారిజాతమోహన్, చెన్నబోయిన వెంకటేష్,సర్పంచ్ బూరుగు చంద్రకళ, సింగిల్ విండో మాజీ చైర్మన్ చీర్క సంజీవరెడ్డి, అవ్వారి గోవర్ధన్, బోదాసు వెంకటేష్, పల్లె మధు కృష్ణ,కొండే శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.