నవతెలంగాణ – అమరావతి
అమరావతి ఆర్ 5 జోన్లో ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన స్టేపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో ఎస్ఎల్పీ దాఖలు చేసింది. ఈ పిటిషన్కు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ డైరీ నెంబర్ను కేటాయించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేస్తే తమ వాదనలు కూడా వినాలని అమరావతి రైతులు కోరుతున్నారు. ఇప్పటికే వారు సుప్రీంకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలు చేశారు.